శ్రీనగర్ : శాంతి భద్రతల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి హెచ్చరికలు రావడంతో ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) శైలేంద్ర కుమార్ ప్రకటించారు. జమ్ముకాశ్మీర్లోని 12,500 పంచాయతీలకు మార్చి అయిదవ తేదీ నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇది వరకే షెడ్యూలు ప్రకటించింది. శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను రెండు మూడు వారాల్లో పరిష్కరించి తాజా షెడ్యూలను త్వరలో విడుదల చేస్తామని సిఇఒ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
previous post
next post