అమరావతి, మార్చి 13: రాజధాని ప్రాంతంలోని మంగళరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుండే పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేయనున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా నారా లోకేష్ పేరును ప్రకటించారు.
నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేయడం ఇదే మొదటి సారి. ఐటి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు.
తొలుత లోకేష్ విశాఖ లేదా భీమిలి నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని భావించారు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఘంటా శ్రీనివాసరావు లోక్సభకు పోటీ చేయడానికి నిరాకరించడంతో పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం మంగళగిరి టికెట్ను లోకేష్కు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు.