న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాధ్ మేనల్లుడు రతుల్ పూరీని ఇడి అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. అగస్టా కేసులో సిబిఐ రతుల్కు సోమవారం సమన్లు జారీ చేసింది. ఒక్క రోజు తిరగకుండానే బ్యాంకులను మోసగించిన కేసులో ఆయనను అరెస్టు చేశారు.
రతుల్ పూరీ మరో నలుగురు కలిసి మోసెర్ బేర్ అనే సంస్థ పేరుతో వివిధ బ్యాంకుల నుండి 354కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు సిబిఐకి ఎస్బిఐ ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తునకు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సోమవారం ఆరు ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. కంపెనీ మేజేజింగ్ డైరెక్టర్ రతుల్ పూరీ, డైరెక్టర్లు నీతా పూరీ, సంజయ్ జైన్, వినీత్ శర్మపై అభియోగాలను దాఖలు చేశారు.
బ్యాంకులను మోసం చేసిన కేసుతో పాటు రతుల్ పూరీ వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యుపిఎ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణంలో కూడా లంచాలు తీసుకున్నట్లు ఆయనపై దాఖలైంది. అయితే వీటిలో తనకు ఎలాంటి సంబంధం లేదనీ రతుల్ పేర్కొంటున్నారు.