మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాజ్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో వరద ఉదృతి పెరగడంతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వరదలు పొటెత్తడంతో జలాశయాల వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. నైరుతి రుతు పవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల కారణగ మధ్యప్రదేశ్ లోని శివ్నా నదిలో వరద ఉధృతి భారీ పెరగడంతో నదీ పరివాహాక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మందాసుల్ ప్రాంతంలో గల పశుపతినాధ్ ఆలయంలోకి నీరు చేరింది. శివలింగం దాదాపు సగం మేరకు నీట మునిగింది.
కాగా మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నర్మదానది, దాని ఉప నదుల వద్ద అప్రమత్తంగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి సిఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఫోన్ చేసి రాష్ట్రంలో వరద పరిస్థితుల గురించి వివరించారు.
వరదల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నదుల్లో భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.