మహారాష్ట్ర సీ ఎం ఉద్దవ్ థాకరే తెగ కంగారు పడిపోతున్నారు. తన ప్రభుత్వాన్ని దమ్ముంటే కూల్చాలంటూ బీజేపీకి సవాల్ చేస్తున్నారు. బిజెపి ఏదో మధ్యప్రదేశ్, కర్ణాటక, ప్రస్తుతం రాజస్థాన్ వంటి రాష్ట్రలలో ఎదో తమ పాటి చిన్న రాజకీయాలు చేసుకుంటే ఉద్ధవ్ థాకరే ఎందుకో పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్నారు. ఇది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది. ప్రస్తుతానికి బీజేపీ టార్గెట్ మొత్తం రాజస్థాన్ మాత్రమే. బిజెపి ఏం చేసినా ఒక పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా చేస్తోంది. కర్ణాటకలో జేడీయూ – కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసినా, మధ్యప్రదేశ్ లో బీ జే పీ గద్దెనెక్కినా, ప్రస్తుతం రాజస్థాన్ లో రాజకీయ డ్రామాలు నడుపుతున్నా ఏదైనా బీ జే పీకే సాధ్యం. మహారాష్ట్ర వరకు ఇంకా బీ జే పీ ఆలోచన చెయలేదేమో. ఆ ఆలోచనే జరిగితే ఉద్ధవ్ కాదు కాదా ఆయన తండ్రి బల్ థాక్రే కూడా ఆపలేరు.
మహారాష్ట్ర సీ ఎం ఉద్దవ్ ఏమన్నారంటే …
‘బీ జే పీతో తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. తమ ప్రభుత్వం అయిదు ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. అంతర్జాతీయ సంబంధాలపై కేంద్ర ప్రభుత్వానికి ఓ క్లారిటీ ఉండాలి. నేడు మనం చైనాను వ్యతిరేకిస్తున్నాం. కానీ… రాబోయే రోజుల్లో చైనా- భారత్ మిత్ర దేశాలుగా మారవచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై మనం మరింత కష్టపడాల్సి ఉంటుంది. మరింత స్పష్టత రావాల్సి ఉంది’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ పరిణామాలపై శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంలో ఉద్ధవ్.. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై మాట్లాడారు.