ముంబై: భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఐ పి ఎస్ అధికారి అబ్దుల్ రహమాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు మతతత్వ పూరితమైనదనీ, రాజ్యాంగ విరుద్ధమైనదనీ ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ముంబయిలో స్పెషల్ ఐజీగా రహమాన్ పని చేస్తున్నారు.శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా గురువారం నుంచి విధులకు హాజరు కావడం లేదని అయన స్పష్టం చేశారు.