ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్లోని అమృతసర్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమర్ సింగ్తో సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అభ్యర్థించినా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
రెండు సార్లు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ రెండు సార్లు రాజ్యసభ నుండే ప్రాతినిధ్యం వహించారు. 2009లో అమృతసర్ నుండి పోటీ చేసే అవకాశం వచ్చినా అనారోగ్య కారణాలతో పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేసిన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కెప్టెన్ అమరీందర్ సింగ్ విజయం చేతిలో పరాజయం పాలయ్యారు. 2017లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నిక కావడంతో ఆ స్థానాన్ని ఖాళీ చేశారు.