న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. కర్తార్పూర్లో ఉన్న దర్బార్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన పాల్గోనున్నారు. నవంబర్ 9వ తేదీన జరిగే ఈ వేడుకకు మాజీ ప్రధాని మన్మోహన్తో పాటు పంజాబ్ సీఎం మరీందర్ సింగ్ కూడా కర్తార్పూర్ వెళ్లనున్నారు. కర్తార్పూర్ కు రావాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖరేషి ఇప్పటికే ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కర్తార్పూర్ వెళ్లడం లేదని కాంగ్రెస్ వర్గాలు మొదట్లో వెల్లడించాయి. అయితే పంజాబ్ సీంఎం అమరీందర్సింగ్ ఆహ్వానించడంతో ఆయన ప్రయాణంపై క్లారిటీ వచ్చింది. నవంబర్ 12న గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 9న కర్తార్పూర్ గురుద్వారాకు తొలివిడత భక్తులతో కలిసి వెళ్లడానికి మన్మోహన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రవీన్ తుక్రాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Former PM Dr Manmohan Singh accepts @capt_amarinder’s invite to join 1st Jatha to Sri Kartarpur Gurdwara on Nov 9, will also attend Sultanpur Lodhi main event @550yrsGuruNanak pic.twitter.com/cD9rJoZUBT
— Raveen Thukral (@RT_MediaAdvPbCM) October 3, 2019
గురునానక్ 550వ జయంతి వేడుకల్లో మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొంటారు. పంజాబ్లోని సుల్తాన్పూర్ లోద్లో జరిగే ఈవెంట్లో రాష్ట్రపతి రామ్నాథ్తో పాటు ప్రధాని మోదీ కూడా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితోపాటు రాష్ట్రపతిని పంజాబ్ సీంఎం అమరీందర్సింగ్ ఆహ్వానం అందించారు. మరోవైపు పాక్కు తాను వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఖండించారు. కర్తార్పూర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వెళ్లరని ఆయన అన్నారు.
Punjab Chief Minister Captain Amarinder Singh: There is no question of me going(to Pakistan for Kartarpur corridor opening) and I feel Dr.Manmohan Singh will not go as well pic.twitter.com/TLhRIz48bB
— ANI (@ANI) October 3, 2019
గురు నానక్ 550 జయంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం, భారత్లో ఉన్న సిక్కు యాత్రికుల కోసం కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించబోతుంది. కార్తార్పూర్లో ఉన్న దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ ఆశ్రమం వరకు ఈ కారిడార్ను నిర్మిస్తున్నారు. కర్తార్పూర్లోని గురుద్వారా సాహిబ్ వరకు పాక్ దీన్ని నిర్మిస్తుండగా, పంజాబ్లోని డేరా బాబా నానక్ నుంచి భారత్ నిర్మిస్తోంది. దీంతో భారత్లో నుంచి వెళ్లే సిక్కు భక్తులు ఎటువంటి వీసా అనుమతులు లేకుండానే అక్కడి వెళ్లే వీలుకల్పిస్తున్నారు. కేవలం అక్కడి వెళ్లేందకు పర్మిషన్ తీసుకుంటే చాలు. పాకిస్థాన్ దర్బార్ సాహిబ్ ఎంతో చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. సిక్కు మత గురువు గురునానక్ తన జీవిత కాలంలో చివరి 18 ఏళ్లు ఇక్కడే సేదతీరినట్టుగా సిక్కులు భావిస్తారు. అందుకే ఈ గురుద్వారాను ప్రతి సిక్కు మతస్తుడు దర్శించుకుంటారు. అయితే దేశ విభజన తర్వాత ఈ ప్రాంతం పాకిస్థాన్ కిందికి వెళ్లింది. అయితే భారత్లో ఉన్న సిక్కులు దర్శించుకోడానికి గతంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చేది. దీంతో కర్తార్పూర్ కారిడార్ పేరిట నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తోంది.