ఢిల్లీ, మార్చి 7 : తాను సజీవంగానే ఉన్నాననీ, తన ఆరోగ్యంపై వస్తున్నవన్నీ పుకార్లేనని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేర్కొన్నారు.
మసూద్ చనిపోయినట్టు కొద్ది రోజులుగా వదంతులు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఆయన మరోసారి తెరమీదికి వచ్చాడు.
మసీదులు, ముస్లింలపై పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న విచారణను వెంటనే నిలిపివేయాలంటూ మసూద్ హెచ్చరించాడు.
బుధవారం రాత్రి జైషే మహ్మద్కి చెందిన వెబ్సైట్లో అతడు ఒక ఆడియో క్లిప్ పోస్టు చేసినట్టు ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ వెల్లడించింది.
టైమ్స్ నౌ కథనం ప్రకారం… 11:41 నిమిషాల నిడివి గల ఈ ఆడియోలో భారత్, పుల్వామా దాడి సహా పాకిస్తాన్లోని ఉదారవాదుల గురించి అజార్ ప్రస్తావించాడు. కశ్మీర్లో భారత్కు వ్యతిరేకంగా జిహాద్ మొదలుపెట్టాలంటూ తన అనుచరులకు పిలుపునిచ్చాడు.
‘‘నా మరణం గురించి వార్తలు వస్తున్నాయి కానీ ఎంత కాలం బతకాలో, ఎప్పుడు చనిపోవాలో దేవుడే నిర్ణయిస్తాడు..’’ అని అజర్ పేర్కొన్నాడు.
ఇండియా జైల్లో ఉన్నప్పుడు తనను చిత్ర హింసలు పెట్టారని అతను ఆరోపించాడు.
పాకిస్తాన్ ఒత్తిడి కింద పనిచేస్తోందనీ.. ‘‘దేవుడికే’’ భయపడాలని చెప్పుకొచ్చాడు.