ఇస్లామాబాద్: జైషే మహమద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ సోదరుడు ముఫ్తి అబ్దుల్ రవూఫ్, అతని కుమారుడు హమజ్ అజహర్ లతో సహా 44మంది నిషేదిత ఉగ్రవాద నాయకులను పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
జైషే మహమద్ సంస్థ సభ్యులు 44మందిని అరెస్టు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినట్లు ఎన్ డిటివి పేర్కొన్నది.
ఈ విషయాన్ని పాక్ మంత్రి సహర్యార్ ఖాన్ ఆఫ్రిది మిడియాకు తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడిలో భారత్ కు చెందిన 40మంది సిఅర్ పిఎఫ్ జవానులు బలయ్యారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన మెరుపుదాడి చేసి బాలాకోట్ లోని ఉగ్రవాద నేతల శిబిరాలను ధ్వంసం చేసింది.
ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతియ్యంగా ఒత్తిడి పెరుగుతోంది.
ఈ నేపధ్యంలో ఉగ్రవాద సంస్థ సభ్యులను పాక్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
పుల్వామా దాడికి సంబందించిన వివరణ భారత్ తమకు సమర్పించిందని మంత్రి సహర్యార్ ఆఫ్రిది తెలిపారు.
ఉగ్రవాదుల అరెస్టు చేయడంలో తమపై ఎటువంటి ఒత్తిడి లేదని ఆఫ్రిది అన్నారు.
నిషేదిత ఉగ్రవాద గ్రూపు సంస్థలపైన తాము చర్యలు తీసుకుంటున్నామని ఆఫ్రిది తెలియజేశారు.