(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
షిల్లాంగ్: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొనగాడయిన మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈశాన్య రాష్ట్రాలను అట్టుడికిస్తున్న పౌరసత్వం సవరణ బిల్లును ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన ఎంచుకున్నారు. విభేదాల ప్రజాస్వామ్యం వద్దనుకునే వారు ఉత్తర కొరియాకు వెళ్లిపోవాలని ఆయన ట్వీట్ చేశారు.
పౌరసత్వం సవరణ బిల్లును ప్రస్తావిస్తూ, ఈ వివాదంలో రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి ఈ దేశం ఒకసారి మతం పేరుతో చీలిపోయింది. రెండు ప్రజాస్వామ్యంలో విభేదాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి వద్దనుకుంటే ఉత్తర కొరియాకు వెళ్లండి అని తథాగత రాయ్ ట్వీట్ చేశారు.
Two things should never be lost sight of in the present atmosphere of controversy.
1. The country was once divided in the name of religion.
2. A democracy is NECESSARILY DIVISIVE. If you don’t want it go to North Korea.— Tathagata Roy (@tathagata2) December 13, 2019
ఆయన ఈ ట్వీట్ పోస్టు చేసిన కొన్ని గంటలకు నిరసనకారులు రాజ్భవన్ భద్రతావలయం ఛేదించి లోపలకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పి బాష్పవాయువు కూడా ప్రయోగించారు. ఈ సంఘటనలో పలువురు నిరసనకారులు, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.