న్యూఢిల్లీ: ఆంటిగ్వా పౌరసత్వం తీసుకుని అక్కడ తలదాచుకున్న వజ్రాల వ్యాపారి, నీరవ్ మోదీ సన్నిహిత బంధువు మెహుల్ చోక్సీకి ఇండియా జైలు తప్పేట్లు లేదు. 13,500 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నిందితుడైన 59 ఏళ్ల చోక్సీ గత ఏడాది జనవరిలో దేశం దాటివెళ్లాడు. అతనిని తిరిగి ఇండియా రప్పించేందుకు ప్రభుత్వం చట్టపరంగా ప్రయత్నిస్తున్నది.
చోక్సీకి చట్టపరమైన దారులు అన్నీ మూసుకుపోయిన తర్వాత అతని పౌరసత్వం రద్దు చేస్తామని ఆంటిగ్వా ప్రధానమంత్రి గస్టోన్ బ్రౌనీ చెప్పినట్లు ఆంటిగ్వా అబ్జర్వర్ పత్రిక తెలిపింది. ఆర్ధిక నేరాలలో పాలుపంచుకున్న నేరస్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించేది లేదని ఆయన చెప్పారు.