(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
క్రీడామైదానంలో ఆట విరామ సమయంలో ఓ వాలీబాల్ క్రీడాకారిణి తన బిడ్డ ఆకలి తీర్చేందుకు పాలు ఇస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయిదు రోజుల పాటు జరిగే మిజోరామ్ స్టేట్ గేమ్స్ 2019 క్రీడలు సోమవారం ప్రారంభమయ్యాయి. టుయికుమ్ వాలీబాల్ టీమ్లో పాల్గొన్న లాల్వేన్త్లుఅంగీ అనే క్రీడాకారిణికి ఏడు నెలల పసిబిడ్డ ఉంది. ఈ పోటీల్లో పాల్గొన్న లాల్వేన్త్లుఅన్గీ పాల కోసం ఏడుస్తున్న పసిపాపకు ఆట మధ్యలో తల్లిపాలు ఇచ్చి బిడ్డపై ఉన్న ప్రేమను, ఆట పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నది. ఆమె బిడ్డకు పాలిచ్చిన ఫోటోను నింగ్లున్ హంగల్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయగా నెటిజన్లు ఆ క్రీడాకారిణిని అభినందిస్తున్నారు.
ఈ ఫోటోను చూసిన మిజోరాం క్రీడల మంత్రి రాబర్ట్ రోమవియా ఆ క్రీడాకారిణిని మెచ్చుకుంటూ పదివేల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు.