న్యూఢిల్లీ: కర్నాటక అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నేటి సాయంత్రం ఆరు గంటలలోపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ రమేష్ కుమార్ ఎదుట హజరుకావాలని ఆదేశించింది. స్పీకర్ ముందు హజరై రాజీనామా విషయాన్ని ఆయనతో చర్చించాలని ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్కు నోటీసులు జారీ చేస్తూ ఈ అంశంపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఎమ్మెల్యేలు అందరూ బెంగళూరు చేరుకునేందుకు అవసరమైన భద్రత కల్పించాలని కర్నాటక డిజిపికి సుప్రీం సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సిఎం కుమార స్వామి రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి తన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో సమావేశమయ్యారు. వీరి మధ్య చర్చకు వచ్చిన అంశాల వివరాలు బయటకు రాలేదు.