అమేథి, మార్చి 3 : భారత్ అత్యాధునిక ఆయుధాల బాట పట్టినది. లెజెండరీ ఏకే 47 తుపాకులకు సంబంధించిన లేటెస్ట్ ఆయుధం ఏకే-203 ను భద్రతా దళాలకు అందించనున్నది. ఈ మేరకు రష్యన్ సంస్థతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించినది. ఆదివారం యుపిలోని అమేథిలో పర్యటించిన ప్రధాని మోది…ఏకే 203 రైఫిల్ ప్లాంటును ప్రారంభించారు.
తొలి విడతలో ఏకే-203లను త్రివిధ దళాలకు అదజేయనున్నారు. రెండో విడతలో పారామిలిటరీ, రాష్ట్ర పోలీసు బలగాలకు అందజేస్తారు.
ఇప్పటి వరకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది వాడుతున్న ఇన్సాస్ అస్సాల్ట్ రైఫిల్స్ స్థానంలో వీటిని వినియోగించనున్నారు.
దీంతోపాటు, ఇప్పటికే అమెరికన్ సిత్ సాయర్ సంస్థతో 7.69ఎంఎం 59 క్యాలిబర్ అడ్వాన్స్ డ్ అస్సాల్ట్ రైఫిల్స్ కోసం భారత రక్షణ శాఖ ఒప్పందం కూర్చుకున్నది. ఈ ఆయుధాలను సరిహద్దుల్లో చొరబాట్లను నియంత్రించే బలగాలకు అందజేయనున్నారు.
ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ పనితీరుపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. పదేళ్ల క్రితమే వీటి స్థానంలో అత్యాధునిక రైఫిల్స్ అందజేయాలని భారత ప్రభుత్వం భావించినది. టెండర్లు ఒక కొలిక్కి రాకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.