మనం చాలా గౌరవించే ఒక పెద్దమనిషి సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు కనబడితే మనం ఏమనుకుంటాం? అదేంటి అంత పెద్దమనిషికి పెద్ద మనసు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతాం. ఆ పెద్దమనిషి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయితే! ఈశాన్య భారతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మపుత్ర మీద నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కీలకమైనది.
అప్పటి ప్రధాని హెచ్. డి. దేవెగౌడ 1997లో వంతెన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అయితే 2002లో అప్పటి ప్రధాని వాజ్పేయీ నిర్మాణాన్ని ప్రారంభించేవరకూ పని మొదలు కాలేదు. ఇన్నాళ్లకు పూర్తయిన ఈ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ సందర్భంగా యూట్యూబ్లోని నరేంద్ర మోదీ ఛానల్లో వంతెన వివరాలతో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో మోదీ, వాజ్పేయీ ప్రస్తావన ఉంది తప్ప అసలు మొదట శంఖుస్థాపన చేసిన దేవెగౌడ ప్రస్థావన మాట మాత్రంగా కూడా లేదు. దీనిని ఏమనాలి! ఆ! ఈ సంగతి ప్రధానికి తెలిసి జరుగుతుందా, వీడియో ఎవరో పోస్టు చేసి ఉంటారు కదా అనేవాళ్లు కూడా ఉండవచ్చు. వారికి తెలియాల్సింది ఏమంటే యధారాజా తథాప్రజా.
ఈ వీడియోను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.