అమరావతి, ఎప్రిల్ 1: చంద్రబాబు అన్నట్లు జగన్మోహనరెడ్డికి నమ్ముకున్నవారిని వెన్నుపోటు పొడిచే విషయంలో మాత్రం అనుభవం లేదని ప్రముఖ సినీనటుడు మోహన్బాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు మోహన్బాబు విచ్చేశారు.
ఈ సందర్భంగా వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
నిత్యం జగన్పై కేసుల గురించి మాట్లాడే చంద్రబాబు ఆయనపై ఉన్న 11కేసుల గురించి ప్రజానీకానికి తెలియకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మోహన్బాబు విమర్శించారు.
ఆయన పరిపాలనలో మట్టి, ఇసుక కూడా మిగల్చకుండా దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమం కోరే వైఎస్ జగన్మోహనరెడ్డికి కులం రంగు వేసి చంద్రబాబు నాయుడు మాత్రం తన వారిని మాత్రం వెంటేసుకొని పరిపాలన చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడికి ఇదే చివరి దశ ఎన్నికలంటూ, ఈ ఎన్నికల్లో 135 సీట్లతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మోహన్బాబు ధీమా వ్యక్తం చేశారు.
కెసిఆర్ మనకు విరోధికాదు, పక్క రాష్ట్ర స్నేహితుడు అని మోహన్బాబు వ్యాఖ్యానించారు.