ఈ కరోనా దయవల్ల మనిషిలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మానవతా విలువలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. తమ కుటుంబ సభ్యులు చనిపోతే వెళ్లి సొంత వారే అంత్యక్రియలు చేసి వారిని గౌరవంగా ఈ లోకం నుండి సాగనంపే పరిస్థితి లేకపోయింది. అలాంటి అపూర్వ అవకాశం వచ్చినా చాలా మంది వారు ఇంటి వారిని అనాధ శవాలుగా వీధిలోనే మగ్గిపోయినా పర్లేదు కానీ తామైతే రిస్క్ చేయము అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతో ఇన్నిరోజులు చూపించే కేవలం ప్రేమ కేవలం కృత్రిమం అని ఎన్నో చోట్ల బయటపడింది. అయితే ప్రతిసారీ ఎవరో ఒకరు ఆ బాధ్యతలు తీసుకొని ఇంకా మానవుల్లో కొంచెం మానవత్వం బతికి ఉందని నిరూపిస్తున్నారు. అలా సొంత వారి మృతదేహాలను గాలికొదిలేసిన వారిపై అందరూ తీవ్ర విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.
కొంతమంది మాత్రం పరిస్థితి రీత్యా చనిపోయిన వాళ్ళ సేవలను కుటుంబాలకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించకపోయేసరికి వారీ…. తమ వారు చనిపోయిన బాధ కంటే చివరి చూపు చూడలేకపోయామే…. అన్న బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. తాజాగా జిహాద్ అల్ అనే పాలస్తీనియన్ అలాంటి వేదను ను తన దరికి రానివ్వకుండా పెద్ద సాహసమే చేశాడు. కరోనా బారినపడిన తన తల్లిని చూసేందుకు అక్కడి ఆసుపత్రి వారు అనుమతించకపోయేసరికి హాస్పిటల్ లోని ఎత్తైన గోడ ఎక్కి…. కిటికీ లో నుండి నుండి తన తల్లిని చూసుకునేవాడు ఇలా ఆమె ఐదు రోజులు ట్రీట్మెంట్ తర్వాత తుదిశ్వాస విడిచింది. తల్లి కోసం ఆ కుమారుడు పడ్డ కష్టాన్ని.. ఆమె పట్ల చూపిన అపార ప్రేమని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటో బాగా వైరల్ కాగా దానిని చూసిన అందరూ తల్లి కోసం తన కుమారుడు చేసిన సాహసాన్ని కొనియాడుతున్నారు. అందరూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రేమ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అని…. అతనిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజుల్లో పిల్లలు ఉన్నత విలువలతో ఎదగాలని హితవు పలుకుతున్నారు. ఎంతైనా అంత విషమ పరిస్థితుల్లో ఉన్న తన తల్లిని చూసేందుకు అతను ఐదు రోజులు అంత ఎత్తు ఉన్న గోడను ఎక్కి అలా గంటలు గంటలు ఆమె అనుభవిస్తున్న వేదనను చూడడం అంటే మామూలు విషయం కాదు. అతని తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని…. అలాగే ఆమె కోరుకున్నట్లు జిహాద్ అల్ కూడా జీవితంలో మంచి ప్రయోజకుడు కావాలని న్యూస్ ఆర్బిట్ బృందం కోరుకుంటోంది.