(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వ పాలనా తీరును ప్రశంసిస్తూ కాపు రిజర్వేషన్ అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. ‘మా జాతికి సంబంధించిన బిసి-ఎఫ్ ఫైల్ కేంద్ర ప్రభుత్వం, హోమ్ శాఖలో పెండింగ్ లో ఉందని చెబుతున్నారు, ఆ ఫైల్ ను ఆమోదించమని ప్రధాన మంత్రి మోదీ కి ముఖ్య మంత్రిగా ఒక లేఖ రాస్తారని కోరుతున్నాను’ అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో తాను పాల్గొన్న విషయాన్ని, ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయాన్ని లేఖలో ముద్రగడ గుర్తు చేశారు.
ముద్రగడ రాసిన లేఖ..