లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన హైదరాబాద్ దిశ దారుణ హత్య మరువక ముందే ఉత్తరప్రదేశ్ మరో దారుణం చోటుచేసుకున్నది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్లో అత్యాచార బాధితురాలిపై అయిదుగురు కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఈ యువతిపై కొద్ది నెలల క్రితం ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ కేసులో బెయిల్పై విడుదలైన నిందితులు కేసు విత్డ్రా చేసుకోవాలని ఆమెపై కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తున్నారు. ఆమె కేసు వాపస్ తీసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో అత్యాచర కేసులో నిందితుల్లో ఒకడు మరో నలుగురు యువకులతో కలిసి గురువారం నడిరోడ్డుపైన ఆమెపై కిరోసన్ పోసి నిప్పు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని హుటాహుటిన లక్నో ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. వెంటనే ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారు అయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో దిశ హత్య ఘటన షాక్ నుండి కోలుకోకముందే యుపిలో ఈ దారుణ ఘటన జరగడం తీవ్రంగా కలచివేస్తున్నది.
previous post
next post