(న్యూస్ ఆర్బిట్ డెస్క్) :
కర్ణాటకలోని మైసూరుకు చెందిన కృష్ణకుమార్ అనే వ్యక్తి 70 ఏళ్ల తన తల్లిని దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తున్నాడు. అది కూడా ఓ పాత బజాజ్ చేతక్ స్కూటర్ పై. గత జనవరి నుంచి ఇప్పటివరకు 48,100 కిలోమీటర్లు విజయవంతంగా చుట్టివచ్చాడు. వివరాల్లోకి వెళితే..ఎపుడూ ఏదో పనితో తీరికలేకుండా ఉండే కృష్ణకుమార్ ని హంపీకి తీసుకెళ్లమని అతని తల్లి అడిగింది. దీంతో ఎపుడూ ఏమి అడగని అమ్మ అడిగిన ఒక్క కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యాడు. తల్లితో కలిసి యాత్ర చేపట్టేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 70 ఏళ్ల తన తల్లిని కేవలం హంపీకి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను చూపిస్తున్నాడు.
కృష్ణకుమార్ యాత్రకు సంబంధించిన వీడియోను నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘ఇది ఒక అందమైన కథ. ఓవైపు అమ్మ ప్రేమ, మరోవైపు దేశంపై ప్రేమ. మనోజ్ ఈ వీడియో షేర్ చేసినందుకు ధన్యావాదాలు. మీరు ఒకవేళ కృష్ణకుమార్కు నన్ను కలిసే అవకాశం ఇస్తే..నేను కృష్ణకుమార్ మహీంద్రా కేయూవీ 100 ఎఎక్స్టీ కారును అతనికి బహుమతిగా ఇస్తా. ఆ తర్వాత కృష్ణకుమార్ తన తల్లితో మిగతా ప్రయాణాన్ని మహీంద్రా కారులో పూర్తి చేయొచ్చ’ అని ట్విట్ చేశారు.
A beautiful story. About the love for a mother but also about the love for a country… Thank you for sharing this Manoj. If you can connect him to me, I’d like to personally gift him a Mahindra KUV 100 NXT so he can drive his mother in a car on their next journey https://t.co/Pyud2iMUGY
— anand mahindra (@anandmahindra) October 23, 2019