అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ‘డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా అభ్యర్థన. దయచేసి మీ తప్పులను సరిదిద్దుకుని, మిగిలిన నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించండి. మీకు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలతో గొడవ పెట్టుకోకండి, గందరగోళానికి గురవ్వకండి’ అని పేర్కొన్నారు.
Dear jagan reddy garu.its my simple request ..Plz correct your mistakes and rule the state for next 4 and odd https://t.co/cAxL6UBiN2 have 151 mla's strength.if you think you can do really good governance.dont mess up the state and mess up yourself.its my honest request.
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 18, 2020
‘మీ తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు ఇప్పటికీ సమయం ఉంది. మీరు తప్పులు చేయాలని మేము కోరుకోము. మీరు చేసే తప్పుల ఆధారంగా రాజకీయ ప్రయోజనాలు పొందాలని మేము అనుకోము. ఇటువంటి ఆలోచనలు జనసేన పార్టీకి లేవు. మీ ఎమ్మెల్యేలను నియంత్రణలో పెట్టుకోండి.. మీ విజయాన్ని వారు నాశనం చేస్తారు. మీ నిర్ణయాలను విమర్శించే అవకాశాన్ని మాకు ఇవ్వకండి. రాష్ట్ర ప్రజలందరినీ ఒకేలా చూస్తూ వారిని ప్రేమించండి. కనీసం మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ఉండడానికి ప్రయత్నించండి’ అని నాగబాబు వరుస ట్వీట్లు చేశారు.
Plz don't give us a chance to criticize your decisions.if you think it is an honest advice or a challenge is up to you.plz love all ap people equally and rule them.atleast try to do like your father ys rajasekhar reddy garu.
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 18, 2020
కాగా, ఇటీవలే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలోనే నాగబాబు ఈ ట్వీట్లు చేసినట్లు తెలుస్తోంది.