(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని.. నారా, నందమూరి కుటంబాల జోలికి రావొద్దంటూ హెచ్చరించారు. తమ బావ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారని, తాము గాజులు తొడుక్కోలేదని మండిపడ్డారు. తాము నోరు తెలిస్తే మీ జాతకాలు బయటపడతాయని హెచ్చరించారు. తమ బావను విమర్శిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని నందమూరి రామకృష్ణ సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
“ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే బాధగా ఉంది. ఎవరో కాకినాడ ఎమ్మెల్యే.. ప్రజా ప్రతినిధిగా ఉండి.. హోదా మర్చిపోయి చంద్రబాబుపై నోరు జారారు. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మేము గాజులు తొడుక్కో లేదు.. మాది సంస్కారం ఉన్న పార్టీ. మేము నోరు తెరిస్తే ఎమ్మెల్యే జాతకాలు బయటపెట్టగలం. కానీ బావుండదు. ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి వయసు ఎంత ? చంద్రబాబు వయసు ఎంత ? ఎమ్మెల్యేకు ఉన్న అనుభవం ఎంత ? బాబు అనుభవం ఎంత. ఏదైనా ఉంటే రాజకీయం గురించి మాట్లాడుకోండి.. మా కుటుంబాల జోలికి రావొద్దు. ఇలా రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం సరికాదు. అది మీ చేతిలోనే ఉంది.. జాగ్రత్త” అంటూ రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.
గత వారం ఓ బహిరంగసభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ద్వారంపూడి. ‘మూడు రాజధానులు ఉంటే తప్పా. జగన్ను చూసి నేర్చుకోవయ్యా చంద్రబాబు… నిన్ను ఈ సమాజం ద్వారా ఒరే ల…. కొడకా అని తిట్టాలని ఉంది. నిన్ను కొట్టాలని ఉంది. నీ కోసం, నీ బినామీల కోసం ఆలోచించొచ్చు. రాష్ట్రం కోసం ఆలోచించు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతిని కూడా అభివృద్ధి చేస్తారు. మీ అందరికీ ఒకటే విన్నపం. చంద్రబాబును మొన్న ఎన్నికల్లో ప్రజలు తిప్పి తిప్పి కొట్టారు. మళ్లీ ఆ ముసలోడు లేవకూడదు. ఆ ముసలోడు లేవకుండా ఉండాలంటే మనం ప్రతిరోజూ కష్టపడాలి. ఆ వెధవ చేసిన పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. వాడి వెనుక వారసుడు పప్పు లోకేష్ తయారవుతున్నాడు. వాడికి కూడా కొవ్వు కరిగేలా మనం బుద్ధి చెప్పాలి’ అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తాజాగా నందమూరి రామకృష్ణ వీడియో సందేశం ద్వారా ద్వారంపూడిని హెచ్చరించారు.