న్యూఢిల్లీ: భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఎదురుగా ఆరుబయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ఎనిమిది వేల మంది అతిధులను ఆహ్వానించారు. ప్రదానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసి సంతకం చేయడానికి వెళుతుండగా అక్కడ హాజరయినవారిలో కొందరు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మోదీ తర్వాత రాజనాధ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో కూడా ఆయన మోదీ తర్వాతి స్థానంలో ఉన్నారు.
అనంతరం అమిత్ షా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత నితిన్ గడ్కరీ పేరు పిలిచారు. నాలుగవ మంత్రిగా కర్నాటకకు చెందిన సదానంద్ గౌడ, అయిదవ మంత్రిగా నిర్మలా సీతారామన్ తరువాత రామ్ విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, హరిసిమ్రత్ కౌర్ బాదల్, థావర్ చంద్ గెహ్లాట్, డాక్టర్ సుబ్రమణ్య జయశంకర్, డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిశాంక్, అర్జున్ ముండా , స్మృతి జుబేద్ ఇరానీ, డాక్టర్ హర్షవర్థన్, ప్రకాష్ కేశవ్ జవడేకర్, పీయూష్ జయప్రకాష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి, మహేంద్రనాథ్ పాండే, అరవింద్ గణపత్ సావంత్, గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర స్వతంత్ర హోదా మంత్రులుగా సంతోష్ గంగ్వార్, రావ్ ఇంద్రజిత్ సింగ్, శ్రీపథ్ నాయక్, కెప్టెన్ జితేంద్ర సింగ్, కిరణ్ రిజుజు , ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, మన్సూక్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ, కేంద్ర సహాయమంత్రులుగా అశ్వినీ కుమార్ చౌబే, అర్జున్ రామ్ మేఘవాల్, జనరల్ వి.కె సింగ్, కృష్ణ పాల్ గుజ్జర్, దాన్వే దాదారావ్ పటేల్, కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాల, రామ్దాస్ అథవాలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో, డాక్టర్ సంజీవ్ కుమార్ సంజయ్ షమ్రావ్, అనురాగ్ సింగ్ ఠాకూర్, అంగడి సురేష్ చన్నబసప్ప, నిత్యానంద్ రాయ్, రత్తన్ లాల్ కటారియా, వి. మురళీధరన్, రేణుకా సింగ్ సరుట, సోమ్ ప్రకాష్, రామేశ్వర్ టేలి, ప్రతాప్ చంద్ర సారంగి, కైలాష్ చౌధరి, దేబాశ్రీ చౌధురి, ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన అతిరథ మహారథులు రావడంతో రాష్ట్రపతి భవనం కోలాహలంగా మారింది. బిమ్ స్టెక్ దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు, రజనీకాంత్, కంగనా రనౌత్, కరణ్ జోహార్ వంటి సినీ తారలు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు హాజరయ్యారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి సీనియర్ నేతలు ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్ర సిఎంలు పళనిస్వామి, కుమారస్వామి, దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.