(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉల్లిపాయ ధరలు దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తున్నాయి. వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్నాటకలో నవదంపతులకు ఉల్లిపాయలు బహుమతిగా ఇచ్చారు. బెంగళూరులో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను ఓ గంపలో వేసి పెళ్లి గిఫ్ట్ గా అందజేశారు. ఈ విషయం తెలియక కొత్త జంట ఆ బహుమతిని తెరవగా అందులో ఉల్లిపాయలు కనిపించాయి. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం పలు ప్రాంతాల్లో కీలో ఉల్లి ధర రూ.200కు చేరింది. దీంతో ఇప్పటికే ఉల్లి ధరలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పలువురు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొంతమంది ఉల్లిని బంగారంతో పోల్చితే.. మరికొందరు వినూత్నంగా బహుమతుల రూపంలో ఉల్లిని ఇస్తున్నారు.