(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో మరో దోషి అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన చేసుకున్నాడు. శనివారం నిర్భయ దోషి వినయ్ శర్మ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే మరో దోషి అక్షయ్ క్షమాభిక్షకు అప్పీలు చేసుకోవడం గమనార్హం.
రెండు రోజుల క్రితం అక్షయ్.. సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపి తిరస్కరించింది.