ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం స్వీకారం చేయడంతో ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ..దౌలత్ దరోడా, నితిన్ పవార్ ఇద్దరు ఎమ్మెల్యేలు తాము ఎన్సీపీతోనే ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తెలిపారు.
कळवणचे आमदार नितिन पवार यांनी ते आदरणीय खा. शरद पवारसाहेब व राष्ट्रवादी काँग्रेस पक्षासोबतच असल्याचे स्पष्ट केले असून त्यांच्या सुरक्षिततेबाबत कुटुंबीय व कार्यकर्त्यांना अवगत केले आहे. pic.twitter.com/tqLGOTIvld
— NCP (@NCPspeaks) November 24, 2019
मी पक्षाच्या चिन्हावर निवडून आलेला व आदरणीय पवारसाहेबांचे नेतृत्व मान्य करणारा लोकप्रतिनिधी असून मी सुरक्षित आहे व कुठल्याही परिस्थितीत पक्षाची साथ सोडणार नाही!
– आमदार दौलत दरोडा pic.twitter.com/ar1cqpCrJ1— NCP (@NCPspeaks) November 24, 2019
ప్రస్తుతం అజిత్ పవార్ వెంట తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో దౌలత్ దరోడా, నరహరి జిర్వార్, సునీల్ భూసార, దిలీప్ బంకర్, అనిల్ బైదాస్ పాటిల్, నితిన్ పవార్, సునీల్, బాబాసాహెబ్ పాటిల్, సంజయ్ బన్సాన్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, వీరిలో నితిన్ పవార్, దౌలత్ దరోడా తాము ఎన్సీపీతోనే ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు శుక్రవారం నుంచి ఎన్సీపీతో టచ్ లో లేరు. దీంతో వీరు అజిత్ వెంటే ఉన్నారని ప్రచారం జరిగింది. ఇవాళ అనూహ్యంగా తాము ఎన్సీపీకి విధేయులమని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నితిన్ పవార్ ఉత్తర మహారాష్ట్రలోని గిరిజన ప్రాబల్యం గల కల్వాన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అజిత్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది ఉత్కఠంగా మారింది.
మరోవైపు అజిత్పవార్తో వెళ్లిన నేతలు తిరిగి తమ దగ్గరకు వస్తున్నారని శరద్ పవార్ తెలిపారు. అజిత్పవార్తో పాటు ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, అజిత్తో వెళ్లే ఎమ్మెల్యేలకు ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందని, కాబట్టి ఎమ్మెల్యే పదవి పోతుందని వారు గుర్తించుకోవాలని ఇప్పటికే శరద్పవార్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యే తిరిగి ఎన్సీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.