NewsOrbit
టాప్ స్టోరీస్

జడ్జి లేని కోర్టులో ఉన్నావ్ రేప్ కేసు!

న్యూఢిల్లీ: ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్లాడుతున్న ఉన్నావ్ అత్యాచారం బాధితురాలి కథలో నిర్ఘాంతపరిచే వాస్తవాలు ఒక్కొ       కటిగా బయటకు వస్తున్నాయి. ఆమెపై తాను అత్యాచారం చేయడమే కాకుండా తన అనుచరులకు కూడా అప్పగించిన ఆభియోగంపై జైలులో ఉన్న బిజెపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ అక్కడినుంచే బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం దగ్గర నుంచి, కేసు విచారణలో ఘోరమైన జాప్యం వరకూ విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నాయి.

ఒక లారీ రాంగ్‌రూట్‌లో వచ్చి కారును  ఢీకొన్న ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. బాధితురాలి పిన్నమ్మలు ఇద్దరు మరణించారు. ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. లారీ వచ్చి ఢీకొనడం సెనగర్ పనేనని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సెనగర్‌పై, మరో 11 మందిపై హత్య, హత్యాప్రయత్నం అభియోగలతో కేసు పెట్టారు. ఆదిత్యనాధ్ ప్రభుత్వం సోమవారం రాత్రి ఈ కేసును సిబిఐకి అప్పగించింది.

ఈ ప్రమాదం పుణ్యమా అని ఉన్నావ్ బాధితురాలి పట్ల వ్యవస్థ ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నదీ బయటకువస్తోంది. తన కుటుంబానికి ఏమాత్రం భద్రత లేదని ఆమె సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయం నిన్న బయటకు వచ్చింది. జూలై 12వ తేదీన రాసిన లేఖను 30వ తేదీ వరకూ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లలేదు.

కేసు విచారణను ఉత్తరప్రదేశ్ వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ బాధితురాలి కుటటుంబం పెట్టుకున్న  విజ్ఞప్తి కూడా సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

ఇక రేప్ కేసు విచారణ తీరుతెన్నులు తెలుసుకుంటే వ్యవస్థలు బాధితురాలి పక్షాన ఉన్నాయో నిందితుల పక్షాన ఉన్నయో కాస్త అర్ధం అవుతుంది. కులదీప్ సెనగర్ తనపై అత్యాచారం జరిపినట్లు ఆ మైనర్ బాలిక 2018  ఏప్రిల్‌లో ఫిర్యాదు చేసింది. ప్రజలలో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు సెనగర్‌ను అదే నెలలో అరెస్టు చేశారు.

2018 మే నెలలో  అలహాబాద్ హైకోర్టు ఈ కేసును పిల్లలపై అత్యాచారాల నిరోధక చట్టం కోర్టు నుంచి లక్నోలోని సిబిఐ ప్రత్యేకకోర్టుకు బదిలీ చేసింది. రెండు నెలల తర్వాత సిబిఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2018 జూలైలో సిబిఐ కోర్టు నిందితులపై అభియోగలను పరిగణనలోకి తీసుకుంది. అప్పటినుంచీ ఇప్పటివరకూ కేసులో పురోగతి లేదు.

చట్ట సభల సభ్యులపై క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు అదేశానుసారం 2018 ఆగస్టు 21న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కోర్టును ఏర్పాటు చేసింది. ఉన్నావ్ బాధితురాలి కేసును సిబిఐ ప్రత్యేక కోర్టులోనే విచారించాలా లేక చట్ట సభల సభ్యుల కోసం ఏర్పాటయిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలా అన్న మీమాంసతో కేసు విచారణ పెండింగ్‌లో ఉండిపోయింది.

2019 ఏప్రిల్‌లో సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి వత్సల్ శ్రీవాత్సవ్‌ను ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ స్వస్థలమైన గోరఖ్‌పూర్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో న్యాయమూర్తి లేని కోర్టు ముందు ఉన్నావ్ బాధితురాలి కేసు విచారణ పెండింగ్‌లో ఉంది.

ఇక్కడితో అయిపోలేదు. మొదట ఈ కేసును తనంతట తానుగా చేపట్టి సిబిఐ విచారణకు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు ఈ మధ్య ఈ కేసులో అమికస్ క్యూరీగా (న్యాయస్థానానికి సహాయకుడు) ఉన్న  గోపాల్ చతుర్వేది రిపోర్టును నమోదు చేసింది. ఆశ్చర్యకరంగా, అసలు ఇంతవరకూ కదిలిక లేని ఈ కేసులో విచారణ కొనసాగుతోందని ఆయన హైకోర్టుకు నివేదించారు.

 

 

author avatar
Siva Prasad

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment