హైదరాబాద్: నల్లమలలో యూరేనియం మైనింగ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులను ఇవ్వబోదని స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా యూరేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. యురేనియం విషయంలో కొంత మంది రాజకీయ నాయకులు అత్యంత నీచంగా, భాద్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.
Have announced the Govt stand on Uranium mining issue in Legislative Council today:
NO mining permission has been accorded by Telangana Govt
We will NOT permit any uranium mining in Nallamala forest area
— KTR (@KTRTRS) September 15, 2019
యురేనియం తవ్వకాల విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇస్తే… ఇప్పటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎఎండీ పనులు చేస్తోందన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నల్లగొండ జ్లిలాలోని లంబాపూర్, పెద్దగట్టు, చిత్రియాల్లో 1992-2012 కాలంలో ఎఎండీ యూరేనియం అన్వేషణ కోసం సర్వే, తనిఖీని చేపట్టింది. దాదాపు 18 వేల 550 మెట్రిక్ టన్నుల యూరేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారని కేటీఆర్ వివరించారు.
Minister @KTRTRS makes a crystal clear statement on behalf of Government of Telangana on the Nallamala Uranium Mining issue. pic.twitter.com/FM2BUXw114
— Konatham Dileep (@KonathamDileep) September 15, 2019
#నల్లమలలోయూరేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్యం.. శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి KTR అన్న @KTRTRS @trspartyonline @TelanganaCMO @MPsantoshtrs @BTR_KTR @KTR_News pic.twitter.com/AVJ2ovs6fw
— KISHORGOUD (@kishorgoudtrs) September 15, 2019
గతకొద్ది రోజులుగా యురేనియం తవ్వకాల అంశంపై తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యురేనియం తవ్వకాలను నిలిపివేయాలంటూ సేవ్ నల్లమల్ల కార్యక్రమానికి ప్రణాళికలు రచించారు. అంతేకాదు ఈ ఉద్యమానికి కమిటీ కూడా వేశారు. మరోవైపు సినీ తారలు కూడా సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల్ల అంటూ ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే.