న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీలపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. హర్యానాలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు నేపాలీ అమ్మాయిలు మాదిరిగా కనిపిస్తున్నారన్న కారణంతో తమ జాతీయతను నిరూపించుకోవాలంటూ పాస్ పోర్ట్ ను నిరాకరించారు. హర్యానా రాష్ట్రంలోని అంబాలా ప్రాంతానికి చెందిన భగత్ బహదూర్, తన ఇద్దరు కుమార్తెలు సంతోష్, హెన్నాలకు పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేయించారు. పాస్ట్ పోర్ట్ కోసం కార్యాలయానికి వెళ్లారు. అయితే, వీరిద్దరూ నేపాలీల్లా కనిపిస్తున్నారన్న కారణాన్ని చూపిస్తూ పాస్ పోర్టు జారీకి అధికారులు నిరాకరించారు. జాతీయతను నిరూపించుకోవాలని సూచించారు. దీంతో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఈ సమస్యను రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఘటనపై స్పందించిన అనిల్ విజ్, వీరికి పాస్ పోర్టు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, దర్యాప్తు అనంతరం శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
previous post