(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రేపటి నుండి ఇరాన్ నుంచి ఇండియా చమురు కొనుగోలు నిలిపివేయాలి కాబట్టి ఇక దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కట్టుతప్పే ప్రమాదం ఉంది. ఇరాన్పై తాము విధించిన ఆంక్షలను అన్ని దేశాలూ అనుసరించాల్సిందేనని అమెరికా హుకుం జారీ చేసింది. నిజానికి ఈ దిగుమతులు ముందే నిలిపివేయాల్సిఉంది. ఇండియాతో సహా కొన్ని మిత్ర దేశాలకు అమెరికా కొంత వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు ఇప్పుడు ముగిసిపోయింది.
ఇండియా ఇక యుఎఇ, సౌదీ అరేబియా, అమెరికా నుంచి చమురు కొనుగోలు చేయాల్సిఉంటుంది. ఇరాన్ నుంచి వచ్చే చమురుకు ఇండియా రూపాయల్లో చెల్లింపులు జరిపేది. దానికి తోడు ఇరాన్ ఇండియాకు రవాణా ఖర్చులు లేకుండా చమురు సరఫరా చేసేది. ఫలితంగా ఇరాన్ చమురు చౌకగా అందేది. ఇప్పుడు ఖరీదు పెరుగుతుంది కాబ్టటి వినియోగదారుల వీపు విమానం మోత మోగకతప్పదు.
అమెరికా ఆంక్షలను టర్కీ, చైనా ఖాతరు చేయడం లేదు. ఇండియా చమురు అవసరాలలో పదవ వంతు ఇరాన్ నుంచి వచ్చేది.