న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు’ విధానాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్, త్రిపురల్లో బుధవారం నుంచి ఈ సదుపాయం ప్రారంభమైంది. దీని ప్రకారం ఈ 12 రాష్ట్రాలకు చెందిన ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్ధిదారులు ఏ రాష్ట్రంలో ఉన్నా తమ వాటా రేషన్ సరుకులు తీసుకోవచ్చు.
ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ‘వన్ నేషన్ వన్ రేషన్’ విధానానికి అనుసంధానిస్తారు. ఈ సదుపాయం కింద కొత్త రేషన్ కార్డులు రూపొందించాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో ఒకటో తేదీ జూన్ 2020 నుంచి కొత్త ఫార్మా్ట్ లోని రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి. దేశంలో రేషన్ లబ్ధిదారులకు ఇది అమలులోకి వస్తే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీచేసే కార్డులన్నీ ఒకే స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటాయి.
https://twitter.com/irvpaswan/status/1212311824076439554