(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: కొద్దిసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
తొలుత పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరుపై విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ పార్లమెంట్ సమవేశాల్లోనే జామియా నగర్ కాల్పుల ఘటన, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సిలపై అనుసరించాల్సిన వైఖరిపై చర్చించినట్లు సమాచారం.
ఉదయం 11గంటలకు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ప్రసంగం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11వరకూ జరగనున్నాయి.