అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాలమీద పంపిన బిల్లును కేంద్రం పట్టించుకో లేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లుకు చోటు లభించలేదు.
ఆ బిల్లు ఇప్పట్లో పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. జనవర్ 31న ప్రారంభమైన కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీ వరకు రెండు విడతలుగా కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 45 బిల్లులు ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పాతవి 17 కొత్తవి 28 బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లు లేదు. దీంతో శాసనమండలి రద్దు అంశం ఇప్పట్లో లేనట్టే తెలుస్తోంది.