(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నౌకాదళ దినోత్సవం సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు షేర్ చేసి ఓ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 1970లో ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో కరాచీ పోర్ట్పై భారత నౌకాదళం మెరుపు దాడి చేసింది. సాహసోపేతమైన ఈ పోరాటానికి గుర్తుగా ప్రతీ ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు. రక్షణ దళంలోని త్రివిధ దళాలు అత్యంత ఘనకీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించి, భారతీయ నౌకాదళానికి గౌరవ వందనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓ యుద్ధ నౌక ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇదే ఫొటోను పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి కూడా షేర్ చేశారు. ‘నేవీలోని మహిళలు, పురుషుల ధైర్యం, అంకితభావం, దేశభక్తికి మేము వందనం చేస్తున్నాము’అంటూ ట్వీట్ చేశారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ప్రభుత్వ యాజమాన్యంలోని దూరదర్శన్ న్యూస్ కూడా అదే ఫోటోను ట్వీట్ చేసింది. అయితే, ఈ ఫొటో 2017లో నావికాదళ దినోత్సవం దినోత్సవం సందర్భంగా బీజేపీ ట్విట్టర్ లో షేర్ చేసింది.
Greetings on Indian Navy Day. Let’s wear Armed Forces flag with honour and pride. Contribute generously to the ‘#ArmedForcesFlagDay Fund’ to assure our soldiers that the entire nation cares for them & their families. https://t.co/sFwfNCgrcA pic.twitter.com/PHtqYm9QZU
— BJP (@BJP4India) December 4, 2017
December 4 is celebrated as Navy Day to commemorate Operation Trident. Here are some interesting facts about the day. #IndianNavy #NavyDay #NavyDay2019 @indiannavy @DefenceMinIndia pic.twitter.com/AtVYNlTWaj
— DD News (@DDNewslive) December 4, 2019
నిజానికి ఈ యుద్ధ నౌక భారత నౌకాదళానికి సంబంధించినది కాదు. యుఎస్ నేవీకి చెందిన ఫ్రీడమ్-క్లాస్ లిటోరల్ కంబాట్ షిప్. సముద్ర తీరంలో పని చేయడానికి రూపొందించబడిన 55 లిటోరల్ కంబాట్ షిప్స్ ను రక్షణ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ రప్పించారు. యుఎస్ నేవీ యొక్క అధికారిక వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం…లిటోరల్ కంబాట్ షిప్ ఫోకస్డ్-మిషన్, మాడ్యులర్, ఉపరితల పోరాట యోధునిగా రూపొందించబడింది. యంసీయం ఓడ కంటే ఇది పెద్దది. అంతేకాదు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ నౌకకు సంబంధించిన ఫొటోనే డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా పలు పార్టీల నేతలు షేర్ చేశారు.
ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో