అమరావతి, మార్చి 19: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. పవన్ ఎంచుకున్న రెండు స్థానాలు అధికార పార్టీ సిట్టింగ్ స్థానాలు కావడం గమనార్హం.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక స్థానాల నుండి పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధపడ్డారు. గతంలో తన అన్న మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో పాలకొల్లు, తిరుపతి రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశారు. పాలకొల్లులో పరాజయం అయ్యారు. తిరుపతి నుండి ఘన విజయం సాధించారు. అన్నబాటలో తమ్ముడు కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని భావిస్తున్నారు.
ఇటీవల వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్ష పార్టీకి దక్కకుండా చేసి పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చేందుకే పవన్ కళ్యాణ్ ఎన్నికల గోదాలో ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. రిటైర్డ ఐపిఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ (జెడి) జనసేన పార్టీలో చేరిన సమయంలో చంద్రబాబు సూచనల మేరకే ఆయన జనసేనలో చేరాడంటూ కూడా వైసిపి నేతలు విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అధికార పార్టీ సిట్టింగ్ స్థానాలను ఎంచుకోవడం వారి ఆరోపణలను తిప్పికొట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు.
నిన్నమున్నటి వరకూ జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు అనే విషయంపై ఆ పార్టీ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది.
గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు నామినేషన్ ధాఖలు చేసేది సాయంత్రం కానీ రేపు గాని వెల్లడిస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం ఒక ప్రకటనలో తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ ఎంచుకున్న రెండు నియోజవర్గాల గురించి…..
గాజువాక నియోజకవర్గం నుండి టిడిపి తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తుండగా వైసిపి తరువున తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య దాదాపు 17వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై పల్లా శ్రీనివాసరావు 21వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
భీమవరం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), వైసిపి నుండి గ్రంధి శ్రీనివాస్లు పోటీ చేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామాంజనేయులు (అంజిబాబు) పిఆర్పి అభ్యర్థి వి సూర్యనారాయణరాజుపై 22వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.అనంతరం టిడిపిలో చేరిన అంజిబాబు 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్పై 13వేల ఓట్లకుపైగా ఆధిక్యతతో గెలుపొందాడు.
General body is in their final discussion from which two constituencies , I should be contesting.
Hopefully,they will let me know in an hour or later.— Pawan Kalyan (@PawanKalyan) March 19, 2019
భీమవరం, గాజువాక స్థానాల నుంచి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ @PawanKalyan pic.twitter.com/SuTHdhDRok
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2019