విశాఖ: విశాఖ జిల్లా గాజువాకలోని జివిఎంసి కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. జేడి లక్ష్మీనారాయణ పవన్తో పాటు వచ్చారు.
తొలుత పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయం నుంచి అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కార్యాలయానికి చేరుకున్నారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కార్యాలయం సమీపంలో సందడి నెలకొంది. సిఎం సిఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు.
నామినేషన్ ప్రక్రియ పూర్తవటంతో పాత గాజువాకలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆనందపురం పూల మార్కెట్ వద్ద, సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని పాత జైలు రోడ్డు వద్ద నిర్వహించే సభలో పాల్గొంటారు.
పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకల నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.