(న్యూస్ అర్బిట్ డెస్క్)
అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న దాడులు, రాజధాని మార్పు అంశంతో రాష్ట్రంలో నెలకొన్నఆందోళనలు తదితర అంశాల గురించి నడ్డాతో పవన్ చర్చించినట్లు సమాచారం.
బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఎంపి తేజస్వి సూర్యలను నడ్డా నివాసంలో పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జనసేన రాష్ట్ర నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
రాజధాని మార్పు విషయంలో రాష్ట్రంలో నెలకొన్న అశాంతిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రే నడ్డాతో సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.