అమరావతి: ఉల్లిపాయల కోసం ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినే పవన్ కల్యాణ్ అన్నారు. ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. ఉల్లి సరఫరా కోసం గ్రామ వాలంటీర్లను ఉపయోగించి… ప్రజల ఇళ్ల దగ్గరికే రూ. 25కి ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అవసరమైతే దీనికి ‘జగనన్న ఉల్లిపాయ పథకం’ అనే పేరు పెట్టుకోండని ఎద్దేవా చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019
మీరు ప్రజలని క్యూలలో నుంచోపెట్టి చంపేకంటే , మీరు నియమించిన గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ,ప్రజలు ఇళ్ల దగ్గరికే కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయట్లేదో, Sri Jagan Reddy గారు వివరణ ఇవ్వాలి pic.twitter.com/J726DVYFsy
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019
ఉల్లి కోసం క్యూలైన్లో నిలబడి ఓ వ్యక్తి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మత మార్పిళ్లు, కూల్చివేతలు, కాంట్రాక్టు రద్దుల మీద పెట్టిన దృష్టిని వైసీపీ ప్రభుత్వం ప్రజల అవసరాల మీద, రైతుల కష్టాల మీద పెట్టుంటే బాగుండేదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. ఈ మేరకు పవన్ వరుస ట్వీట్లు చేశారు.
Check the following videos: pic.twitter.com/gFcbJwRPwY
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019
Reserve Bank of Onions,
A short video on New currency-
రూపాయలు బదులు ఉల్లిపాయలు . pic.twitter.com/C8XmUTKh1I— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019