(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యోదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రియాంకరెడ్డిపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని రాజకీయ, సినీ ప్రముఖులు, సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మరో నిర్భయ కేసు అంటూ ప్రియాంకారెడ్డికి శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు నిజంగా తప్పుచేసి ఉంటే వాడికి ఏ శిక్ష విధించినా పర్వాలేదని అతని తల్లి జయమ్మ తెలిపింది. ప్రియాంకను చంపిన విధంగా వాడినీ చంపాలని సూచించింది. ప్రియాంకపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనలో నిందితులైన నలుగురిలో చింతకుంట చెన్నకేశవులు నాలుగో నిందితుడు. నిందితులను ఉరితీయాలంటూ మహిళా లోకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జయమ్మ నోట కూడా అదే మాట వచ్చింది.
ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. నిందితులను ఉరితీయాలంటూ నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. వాళ్లు పశువులతో పోల్చడానికి కూడా పనికిరారని చాలా మంది మండిపతున్నారు. “జైలు వద్దు, కేసులు వద్దు, ఎన్ కౌంటర్ చేయండి” అంటూ సోషల్ మీడియాలో వేదికగా పలువురు గొంతెత్తారు.
‘ప్రియాంకారెడ్డి మరణవార్త విషాదానికి గురిచేసింది. ఇంకా దేశంలో మహిళలకు ప్రాణ రక్షణ లేదనే విషయం దారుణం మరోసారి స్పస్టం చేసింది. ఇలాంటి ఘటనలకు ఏ సమాజాన్ని, మతాన్ని నేను వేలెత్తి చూపడం లేదు. కానీ మన రేప్ నిందితులకు మన న్యాయవ్యవస్థ ఎందుకు మరణశిక్ష్ విధించడం లేదు అని ప్రశ్నిస్తున్నాను’ అని ఓ నెటిజన్ ట్వీట్
speechless, shocked, ashamed , angry
judiciary, police, governments, society
we all are a Big failure
we can't protect our daughters, our sisters, our friends
from Nirbhaya to Priyanka, not even one rapist is hanged
Shame on us all#RIPPriyankaReddy pic.twitter.com/XrFmUERvKZ
— V.HARI PRASAD (@VHARIPRASAD18) November 29, 2019
‘ప్రియాంకరెడ్డి రేప్ దారుణాన్ని చూసి మాటల రావడం లేదు. షాక్ గురయ్యాను. సిగ్గుతో తల దించుకొన్నాను. ఆగ్రహంతో కలిగిస్తున్నది. జ్యుడిషియరీ, పోలీసు, ప్రభుత్వాలు, సమాజం అన్నీ ఫెయిల్ అయ్యాయి. మన కూతుళ్లను, సోదరీమణులను, స్నేహితులను రక్షించుకోలేకపోతున్నామనే బాధ వ్యక్తమవుతున్నది. నిర్భయ నుంచి ప్రియాంక వరకు చూస్తే ఓ ఒక్క రేపిస్టుకు మరణ శిక్ష విధించుకోలేకపోతున్నాం. సిగ్గుతో తలదించుకోవాలి’ అని మరో నెటిజన్ ట్వీట్లో పేర్కొన్నారు.
Priyanka Reddy, 26, Vet, brutally raped and burnt alive in Hyderabad."Men" approached her to get her scooty repaired and meanwhile brought down a joyous living creature to ashes.We demands death penalty to perpetrators, Nothing less will be a denial to justice.#RIPPriyankaReddy pic.twitter.com/Bha6HAb0qN
— Pranjal Malakar #STAYHOME #STAYSAFE (@Pranjalmalakar_) November 29, 2019
దేశంలో పిల్లలు, మహిళలు మృగాళ్లకు బలైవుతున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా చట్టాలను సరిగా అమలు చేయలేకపోతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ప్రజాసంఘాలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్లోకి స్థానికులు, విద్యార్థులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రియాంకారెడ్డి హత్య చేసి నిందితులకు వెంటనే ఉరి శిక్ష విధించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.