భోపాల్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లైంగికదాడులు ఆలయాల్లోపలే జరుగుతున్నాయన్నారు. సనాతన్ ధర్మాన్ని కాషాయ దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మతం పేరుతో ఇలాంటి కార్యకలాపాలకు ఒడిగట్టే వారిని దేవుడు కూడా క్షమించడని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.
https://twitter.com/ANI/status/1173885940315643910
అయితే బీజేపీపై డిగ్గీ రాజా ఈ తరహా ఆరోపణలు, విమర్శలు గుప్పించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఆయన ఈ తరహా ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ‘ఐఎస్ఐ’ నుంచి బీజేపీ, భజరంగ్ దళ్ లకు డబ్బులు తీసుకున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింల కంటే ముస్లిమేతరులు ఐఎస్ఐ తరుపున గూఢచారులుగా పనిచేస్తున్నారని దిగ్విజయ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.