(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
దేశ ద్రోహం కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వీజ్ ముషారఫ్కు లాహోర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనకు మరణదండన విధిస్తూ లాహోర్ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. 2007లో పాక్లో ఎమర్జన్సీ విధించినందుకు 2013లో ముషారఫ్పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. మాజీ అధ్యక్షుడికి ఇలాంటి శిక్ష విధించడం పాకిస్థాన్ చరిత్రలో ఇదే మొదటిది. దేశ ద్రోహం కేసు ఎదుర్కొంటున్న ముషారఫ్ 2016 నుండి దుబాయిలో తలదాచుకున్నారు.
A special court hands death sentence to former military dictator Pervez Musharraf in a high treason case
Read @ANI story | https://t.co/6ypwp8kc32 pic.twitter.com/yAUTElaEgw
— ANI Digital (@ani_digital) December 17, 2019