వారణాసి : ప్రధాన మంత్రి నరేంద్ర మోది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో నేడు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. శుక్రవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా గురువారం మధ్యాహ్నానికి మోది వారణాసికి చేరుకున్నారు. సాయంత్రం బెనారస్ హిందూ యూనివర్శిటీ గేటు నుండి ప్రధాని మోది ర్యాలీ నిర్వహించారు. పురాతన మందిరాలు, గంగానది ఘాట్ల మీదుగా ర్యాలీ సాగింది, దశాశ్వమేథ్ ఘాట్ వద్ద రాత్రి ఈ ర్యాలీ ముగుస్తుంది. గంగా హరతిలో మోది పాల్గొంటారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు, పలువురు బిజెపి ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post
next post