పంజాబ్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతీయుల సంప్రదాయాలను గౌరవించడం మంచి పరిణామం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్పూర్ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. పంజాబ్, సుల్తాన్పూర్ లోధిలో బేర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించారు. పాకిస్థాన్ కర్తార్పూర్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్లోని డేరా బాబా నానక్ గురుద్వారాతో కలిపే ‘కర్తార్పూర్ నడవా’ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గురునానక్ 550వ జయంతికి ముందుగానే కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం కోసం సహకరించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కృతజ్ఞతలు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వంతో పాటు ఈ కారిడార్ నిర్మాణంలో కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు మోదీ తెలిపారు.
#WATCH PM Modi speaking at the inauguration of the Integrated Check Post of #KartarpurCorridor https://t.co/HlpnpWrXvK
— ANI (@ANI) November 9, 2019
ఈ నెల 12వ తేదీన గురునానక్ 550వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. సిక్కుల మత గురువు గురు నానక్కు చెందిన గురుద్వారా దర్బార్ సాహిబ్ ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నది. ఈ కారిడార్ను భారత యాత్రికులు ఎటువంటి వీసా అవసరం లేకుండానే సందర్శించవచ్చు. అయితే ప్రతి రోజూ ఐదు వేల మంది సిక్కులు ఆ గురుద్వార్ వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చింది. గురు నానక్ తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా దర్బార్ సాహిబ్లోనే గడిపారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న నరోవల్ జిల్లాలో ఈ గురుద్వారా ఉన్నది.
ਗੁਰਦੁਆਰਾ ਸ੍ਰੀ ਬੇਰ ਸਾਹਿਬ, ਸੁਲਤਾਨਪੁਰ ਲੋਧੀ ਵਿਖੇ ਆ ਕੇ ਮਨ ਨੂੰ ਸੁਕੂਨ ਮਿਲਿਆ।
ਵਾਹਿਗੁਰੂ ਸਭ ਦਾ ਭਲਾ ਕਰੇ। ?? pic.twitter.com/KwdDjOLc6D— Narendra Modi (@narendramodi) November 9, 2019
రావి నది ఒడ్డున ఉన్న కర్తార్ పూర్ లో గురునానక్ దేవ్ నిర్మించిన గురుద్వారా సిక్కులకు పవిత్ర ప్రదేశం. సిక్కుల మత గురువు గురునానక్ పుణ్యక్షేత్రమైన గురుద్వారా దర్బార్ సాహిబ్ ను జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతీ సిక్కు మతస్థుడు భావిస్తాడు. దేశ విభజన వల్ల పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిపోయిన ఆ సాహిబ్ మన దేశంలో పంజాబ్ రాష్ట్రం గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది భారత్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఈ మందిరానికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో కారిడార్ నిర్మాణానికి గత ఏడాది నవంబర్ లో శంకుస్థాపన చేశారు. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తిచేశారు. గతంలో భారతీయులు బోర్డర్ వద్దకు వెళ్లి టెలిస్కోప్ తో ఈ సాహిబ్ చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇరు దేశాల ప్రధానులు కారిడార్ ను ప్రారంభించడంతో ఇక నుంచి భక్తులు గురుద్వారాను దర్శించుకునే వీలుంది. పంజాబ్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు కర్తార్ పూర్ కారిడార్ ను సందర్శించనున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం గురుదాస్ పూర్, కపుర్తాలా, అమృత్ సర్ జిల్లాలకు సెలవు ప్రకటించింది.