గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో శనివారం రోజున బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్, షారూక్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. దక్షిణాదికి చెందిన వారెవరికీ ఈ వేడుకకి ఆహ్వానం అందలేదు. దీనిపై అందరూ కామ్గా ఉంటే రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మాత్రం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు.
“ప్రియమైన నరేంద్ర మోదీగారు.! మీలాంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నందుకు మేమెంతో గర్వపడుతున్నాం. దక్షిణాదిలో మీరంటే ఎంతో గౌరవం ఉంది. దేశంలో అన్నీ రంగాలకు చెందిన ప్రముఖులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఉన్నారు. దక్షిణాది నటీనటులపై నిర్లక్ష్యం చూపించారు. ఎంతో బాధపడి ఈ విషయాన్ని తెలియం చేస్తున్నాం. దక్షిణాది నటీనటులను కూడా గుర్తించండి. మీరు దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం“ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు ఉపాసన.
ప్రస్తుతం ఈ ఇన్స్టా మెసేజ్ వైరల్ అవుతున్నది. సూటిగా, సున్నితంగా ప్రశ్నించిన ఉపాసన కొణిదెలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
https://www.instagram.com/p/B3z0Yy6FWV4/