హీరో చిరంజీవి, నిర్మాత రామ్చరణ్లపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఉయ్యాలవాడ వారసులు ఫిర్యాదు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని రూపొందిస్తోన్న చిత్రం `సైరా నరసింహారెడ్డి`. ఈ సినిమాను రూపొందించే సమయంలో 23 మంది కుటుంబ సభ్యుల రూ.50 కోట్లు ఇస్తామని నిర్మాతలు చెప్పి అగ్రిమెంట్ చేశారని, ఆ క్రమంలో ఉయ్యాలవాడకు సంబంధించిన విషయాలను తెలుసుకుని సినిమా చేశారని నరసింహారెడ్డి వారసులు అంటున్నారు. కథ విషయంలో చేసుకున్న ఒప్పందం డబ్బులు గురించి అడగటానికి చిరంజీవి దగ్గరకు వెళ్లగా ఆయన కలవలేదని, తమను అరెస్ట్ చేయించి తప్పుడు కేసులు పెట్టారని అంటున్నారు.
`సైరా నరసింహారెడ్డి` భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ పాత్రలో నటించగా అమితాబ్ బచ్చన్, నయనతార, కిచ్చాసుదీప్, విజయ్సేతుపతి, జగపతిబాబు, తమన్నా, అనుష్క, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.