(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సినీ తారలపై కొందరు వీరాభిమానం ప్రదర్శిస్తుంటారు. హీరోయిన్లనైతే దేవతలకంటే ఎక్కువగా ఆరాధించేవాళ్లు చాలామంది ఉంటారు. తాజాగా భాస్కర్ రావు అనే ఓ తెలుగు యువకుడు యువ నటి పూజా హెగ్డే అంటే వెర్రి అభిమానం పెంచుకున్నాడు. ఆమెను కలిసేందుకు ఏకంగా ముంబయి వెళ్లి అక్కడి ఫుట్ పాత్ లపై పడుకుంటూ ఓపిగ్గా ఎదురుచూశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రోజులపాటు ముంబై రోడ్లపై ఉన్నాడు. చలి, ఎండను లెక్కచేయకుండా ఫుట్ పాత్ పై ఉంటూ ఎదురుచూశాడు. అయితే, భాస్కర్ రావు వ్యవహారం తెలుసుకున్న పూజా హెగ్డే అతడ్ని కలుసుకుని హితవు పలికారు. ఈ విషయాన్ని పూజా హెగ్డే తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
Bhaskar Rao thank you for coming all the way to Bombay and waiting for 5 days to see me. I am so touched but it also saddens me to see my fans going through so much trouble to do so.I would never want to see you’ll… https://t.co/UZNsxTK4bm
— Pooja Hegde (@hegdepooja) January 15, 2020
ఇలా రోడ్లపై పడుకోవడం, ఫుట్ పాత్ పై ఉండడం మంచిది కాదని చెప్పారు. దయచేసి సొంతూరు వెళ్లిపోవాలని సూచించారు. తన కోసం ఓ అభిమాని అంత కష్టపడడం తనకు బాధ కలిగించిందని, ఇలాంటి అభిమానాన్ని తానెప్పుడూ కోరుకోనని పూజా వెల్లడించారు. “నీ ప్రేమ నాకర్థమైంది. నువ్వు ఎక్కడున్నా నీ అభిమానాన్ని తప్పకుండా ఫీల్ అవుతుంటాను. మీరే నా బలం. ముందు నువ్వు ఇంటికెళ్లు” అంటూ పూజా సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/B7VYxbOHLRi/?utm_source=ig_embed