చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్లో కనిపించే ప్రధాని మోదీ మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాంగా భారత్ కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నారు. అక్కడి నుంచి మహాబలిపురం వెళ్లారు. ఈ సందర్భంగా మహాబలిపురంలో ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. తమిళ సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో మోదీ పంచెకట్టుతో కనిపించారు. అచ్చం ఓ తమిళుడిని తలపించే ఆహార్యంతో ఆయన జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా షర్ట్, ప్యాంట్తో చాలా సింపుల్గా కనిపించారు. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్ కు దగ్గరుండి చూపించారు.
PM @narendramodi and President Xi Jinping are at the Pancha Rathas complex in Mamallapuram. pic.twitter.com/ejVC1aBtxH
— PMO India (@PMOIndia) October 11, 2019