ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇవాళ జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కాస్త ఆలస్యంగా జరగనున్నాయి.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరారు. అయితే, మార్గమధ్యలోనే రాహుల్ ప్రయాణిస్తున్న విమాన ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో మళ్లీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. బీహార్లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్లో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు ఆలస్యంగా జరగనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘పాట్నా వెళ్తున్న మా విమానంలో ఇంజిన్ సమస్య వచ్చింది. దీంతో తిరిగి ఢిల్లీ వెళ్లిపోతున్నాం. సమస్తిపూర్ (బీహార్), బాలాసోర్ (ఒడిశా), సంగంనేర్ (మహారాష్ట్ర) తదితర ప్రాంతాల్లో ఇవాళ సభలు ఆలస్యంగా జరుగుతాయి. అసౌకర్యానికి మన్నించగలరు..’ అని రాహుల్ ట్వీట్ చేశారు. దానితో పాటు ఒక వీడియో సైతం ఈ ట్వీట్కు జతచేశారు.
గత సంవత్సరం కూడా రాహుల్ గాంధీకి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి కర్ణాటకకు వెళ్లారు. విమనంలో సాంకేతిక సమస్య తలెత్తింది. తీవ్రమైన కుదుపులతో విమానం ఒక పక్కకు వాలిపోయింది. దాదాపు 40 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి పైలట్లు అతి కష్టం మీద విమానాన్ని ల్యాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు దీని వెనక కుట్ర ఉందని ఆరోపించారు.
Engine trouble on our flight to Patna today! We’ve been forced to return to Delhi. Today’s meetings in Samastipur (Bihar), Balasore (Orissa) & Sangamner (Maharashta) will run late. Apologies for the inconvenience. pic.twitter.com/jfLLjYAgcO
— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2019