న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత నాయకులకు దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ.. సొంతంగా కారు నడుపుకొంటూ బయటకు వెళ్లారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. ఆయనతో పాటు కారులో ఆయన పెంపుడు కుక్క ‘పీడీ’ కూడా ఉంది. 2017లో ఒక ట్వీట్ ద్వారా పీడీని రాహుల్ అందరికీ పరిచయం చేశారు. సార్వత్రిక ఎన్నికలలో పార్టీ పరాజయం తర్వాత పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొంటానని రాహుల్ పట్టుబట్టారు. నాయకులు మాత్రం ఆయన కొనసాగాలని కోరుతుండటంతో వారికి కూడా కనిపించడం మానేశారు. తాజా ఫొటోలో రాహుల్ తో పాటు పీడీ కూడా కెమెరావైపు చూస్తన్నట్లే కనిపించింది.
Congress @INCIndiaLive president @RahulGandhi in New Delhi on Tuesday. @IndianExpress photo @anilsharma07 pic.twitter.com/EBya53qHKx
— anil sharma (@anilsharma07) May 29, 2019
సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలే గెలుచుకోగా బీజేపీ 303 చోట్ల సొంతంగా గెలిచింది. అప్పటి నుంచి రాహుల్ ఇంటివద్ద పలువురు నాయకులు వెళ్తూ, వస్తూ కనిపించారు. కానీ వాళ్లెవరికీ ఆయన దర్శనభాగ్యం కలగలేదు. తాజాగా పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ కూడా అక్కడకు వెళ్లారు. రాహుల్ రాజీనామా చేయద్దని లాలు ప్రసాద్, స్టాలిన్ లాంటి వాళ్లు కూడా కోరారు. తాను మాయం అయిపోనని, పార్టీ బలోపేతానికి తప్పక కృషి చేస్తానని రాహుల్ అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీ కుటుంబం నుంచే ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Ppl been asking who tweets for this guy..I'm coming clean..it's me..Pidi..I'm way ? than him. Look what I can do with a tweet..oops..treat! pic.twitter.com/fkQwye94a5
— Rahul Gandhi (@RahulGandhi) October 29, 2017